వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్ల మండలం కొడవటిపూడి పంచాయతీలో మూడేళ్లుగా డ్రైనేజ్ క్లీన్ చేయడం లేదని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన 13 మంది ఈ నెల 25న పంచాయతీరాజ్ కమిషనర్ వెబ్సైట్లో ఫిర్యాదు చేశారు.
డ్రైనేజ్ శుభ్రం చేయకపోవడంతో దోమలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, పలువురు అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

