వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలంలోని ఓ పాఠశాలలో జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 255 మంది విద్యార్థులకు నేత్ర వైద్యాధికారి రోణంకి వెంకటరమణ పరీక్షలు చేశారు.
కంటి వ్యాధులు, నేత్ర సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మొబైల్ ఫోన్ అధిక వినియోగంతో కలిగే సమస్యలను వివరించారు. ప్రిన్సిపాల్ జి.రమేష్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

