Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస వేతనాలు చెల్లించాలని ధర్నా

Follow Udayam on Google
K Anuradha Sep 18, 2026 3:12 PM శ్రీకాకుళంGeneral
కనీస వేతనాలు చెల్లించాలని ధర్నా - Udayam
పలాసలో శుక్రవారం మున్సిపల్ శానిటేషన్ కార్మికులు ధర్నా చేపట్టారు. సేవల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ ఏర్పాటు చేసి కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, నాయకులు కె.వెంకటి, బి.కూర్మారావు మాట్లాడారు. కాంట్రాక్టు విధానం విరమించాలని కోరారు. మృతులు, రిటైర్డ్ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మేనేజర్‌కు వినతిపత్రం అందించారు.

Comments

G
Loading comments...