వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎండపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి మేరకు కేటీఆర్ స్పందించి ఈ సాయం అందించినట్లు తెలిపారు. కార్యకర్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచిస్తూ, జగన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

