వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ ముందు డ్రైనేజీపై స్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో కాలువలు ఓపెన్గా ఉన్నాయి. విద్యార్థులు, వాహనదారులు ఏమరపాటుగా ఉంటే గుంతల్లో పడే ప్రమాదం ఉంది.
నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో రాత్రి వేళల్లో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీపై స్లాబ్లు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

