వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన 9999 కొబ్బరికాయల వినాయకుడి విగ్రహంలోని కొబ్బరికాయలను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నట్లు గణేశ ఉత్సవ సమితి కమిటీ తెలిపింది.
గణేశ నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం కొబ్బరికాయలను భక్తులకు పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో విగ్రహాన్ని ఏం చేస్తారనే అంశంపై భక్తుల్లో నెలకొన్న ఆసక్తికి తెరపడింది.
Comments
Loading comments...

