వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలో జింక మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. కమ్మవారిపాలెం పరిధిలోని పొలేరమ్మ గుడి ఎదురుగా మృతి చెందిన జింకను గ్రామస్తులు గుర్తించారు.
అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా కోటప్పకొండ బీట్ ఆఫీసర్ కిరణ్ ఘటనా స్థలానికి చేరుకొని జింకను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పశువైద్యశాలకు పంపించారు. అనారోగ్యంతోనే జింక మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

