వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈ ఏడాది నవంబర్లో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. హైదరాబాద్తో పాటు మహబూబ్నగర్, వనపర్తి, హనుమకొండ, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 8 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్న ఈ గేమ్స్ తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్నాయి. రాష్ట్ర జట్ల ఎంపిక కోసం ట్రయల్స్, శిక్షణ శిబిరాలను అధికారులు ప్రారంభించారు.
Comments
Loading comments...
