వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ పట్టణంలో రేపు సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలం తెలిపారు. 18 ఏళ్లలోపు బాలబాలికలకు 1,000 మీటర్ల ట్రాక్ సైక్లింగ్, 10 కి.మీ. స్పీడ్ సైక్లింగ్ పోటీలు ఉంటాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తి ఉన్న వారు ఒరిజినల్ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, సైకిల్, క్రీడా దుస్తులతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

