వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు ఆర్థిక భరోసా కల్పించే ఖరీఫ్ పంట బీమా నమోదుకు నేటితో గడువు ముగియనుంది. కామన్ సర్వీస్ సెంటర్లలో ప్రీమియం చెల్లించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతులు నమోదు చేసుకోవచ్చు.
ఆధార్, బ్యాంక్ పాస్బుక్, పట్టాదారు పాస్బుక్, పంట ధ్రువీకరణ పత్రం, మొబైల్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది. వరి పంటకు మాత్రం ఆగస్టు 15 వరకు అవకాశం ఉంది.
Comments
Loading comments...
