Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాళీ స్థలాలు చెత్తకుప్పలుగా

Follow Udayam on Google
madhu Sep 16, 2026 7:11 PM ములుగుGeneral
ఖాళీ స్థలాలు చెత్తకుప్పలుగా - Udayam
పస్రా గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్‌ 11వ వార్డులో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ఖాళీ ఇంటి స్థలాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. దుర్వాసన, దోమలు, ఈగల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు నీరు నిలిచే అవకాశం ఉండటంతో వ్యాధుల భయం నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి ఖాళీ స్థలాలను శుభ్రం చేసి, క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...