వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 15కు చేరిందని ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ తెలిపారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు వెల్లడించారు.
మృతుల కుటుంబాలకు రూ.8 లక్షల పరిహారం, అంత్యక్రియల కోసం రూ.10 వేలు అందించనున్నట్లు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, 316 పునరావాస శిబిరాల్లో 11,018 మంది ఉన్నారని తెలిపారు.
Comments
Loading comments...
