Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌట్ల (కె)లో పిడుగు పడి ఆరు పశువులు మృత్యువాత

Follow Udayam on Google
నిర్మల్ Sep 20, 2026 1:07 PM నిర్మల్General
కౌట్ల (కె)లో పిడుగు పడి ఆరు పశువులు మృత్యువాత - Udayam
నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కె) గ్రామ శివారులో ఆదివారం ఉదయం చెట్టు కింద ఉన్న పశువులపై ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆరు పశువులు మృత్యువాత పడ్డాయి. గ్రామ శివారులో ఎప్పటిలాగే పశువులను చెట్టు కింద ఉంచిన సమయంలో ఈ ఘటన జరిగింది. పిడుగుపాటు ధాటికి నరేష్‌కు చెందిన రెండు పశువులు, భీమన్న, చిన్నబాపు, మోహన్, రాజేశ్వర్‌కు చెందిన ఒక్కో పశువు అక్కడికక్కడే మృతి చెందాయి.

Comments

G
Loading comments...