Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో 71 శాతం ఓటర్ల డిజిటలైజేషన్‌ పూర్తి

Follow Udayam Digital on Google
పవన్ కుమార్ Aug 04, 2026 12:00 PM కరీంనగర్తెలంగాణ
కరీంనగర్‌లో 71 శాతం ఓటర్ల డిజిటలైజేషన్‌ పూర్తి - Udayam Digital
కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఓటరు జాబితా సవరణలో భాగంగా ఇప్పటి వరకు 2,62,466 మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌ పూర్తైంది. మొత్తం 3,68,832 మంది ఓటర్లలో 71 శాతం ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మరణించిన వారు, అందుబాటులో లేని వారు, ఇతర కారణాలతో లక్షకుపైగా ఓటర్ల వివరాలు తొలగింపు జాబితాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...