వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరంలో కళాకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నగర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సంస్కృతికి ప్రతీకైన బోనాల పండుగను కళాకారులు వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

