వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నాయకులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్హౌస్ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.
మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు బాహుబలి మోటార్ల ద్వారానే నీటిని లిఫ్ట్ చేశామని స్పష్టం చేశారు. గ్రావిటీ కాలువల ద్వారానే నీళ్లొచ్చాయనడం కాంగ్రెస్ ఆడుతున్న అబద్ధపు నాటకమని, వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని హితవు పలికారు.
Comments
Loading comments...

