వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పిట్లం పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన రాహుల్, ప్రతీక్, భీమ్ శంకర్ పెట్రోల్ బంక్లో నకిలీ నోట్లు ఇచ్చి పరారయ్యారు.
SI ఆంజనేయులు ధర్మారం టోల్ ప్లాజా వద్ద నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి ₹91 వేలు నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ సరఫరా నెట్ వర్క్ పై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని DSP విఠల్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

