వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున పొలాలకు వెళ్తున్న ఓ రైతుకు చిరుత కనబడినట్లు సర్పంచ్ భర్త సురేందర్ రెడ్డి తెలిపారు.
చిరుతను చూసిన రైతు భయంతో గ్రామంలోకి వెళ్లి చెప్పడంతో గ్రామస్థులు వెళ్లి చూడగా చిరుత పొలాల పక్కనే ఉన్న గుట్టపైకి వెళ్లినట్లు గుర్తించామన్నారు. దీంతో పొలాలకు వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

