వార్తలకు తిరిగి వెళ్లండి
జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనానికి నిరీక్షణ

ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించాలని గత మే నెలలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినా, విద్యాసంవత్సరం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా అది అమలుకు నోచుకోలేదు.
పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది గ్రామీణ విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సరైన రవాణా సౌకర్యం లేక ఉదయం పూట ఆదరాబాదరాగా వచ్చి, మధ్యాహ్నం ఆకలితో అలమటిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
Comments
Loading comments...