Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టులకు రైల్వే పాసులు పునరుద్ధరించాలి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 11:29 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
జర్నలిస్టులకు రైల్వే పాసులు పునరుద్ధరించాలి - Udayam
జర్నలిస్టులకు రైల్వే పాసులు పునరుద్ధరించాలని కోరుతూ కొత్తగూడెం జిల్లా జర్నలిస్టు సంఘాల నాయకులు మంగళవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కరోనా తర్వాత పాసుల జారీ నిలిచిపోయిందని, దీంతో వార్తా సేకరణ, విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో నాగచందర్, శ్రీనివాస్, రాజేందర్, రాము పాల్గొన్నారు.

Comments

G
Loading comments...