వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసి సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఆదివారం ఉదయం ఇందన్పల్లి గ్రామ శివారులో ఉన్న కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వారు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

