వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నేర చరిత్ర కలిగిన వారికి, రౌడీషీటర్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇకనైనా నేర మార్గాన్ని వీడి చట్టబద్ధంగా జీవించాలని సూచించారు.
అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అదేవిధంగా యువత చెడుదారుల్లో పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు.
Comments
Loading comments...

