వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల పట్టణంలోని జిల్లా ఆస్పత్రిలో మౌలికల సౌకర్యాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా ఆస్పత్రిని ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
జిల్లా ఆస్పత్రి భవనం పెచ్చులు ఊడుతోందని, దీంతో రోగులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. కాలేజీ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న భవనంలోకి ఆస్పత్రిని త్వరగా మార్చాలని అధికారులను ఆయన కోరారు
Comments
Loading comments...

