వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలోని గాంధీనగర్ ప్రాంతంలో కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. టీఆర్ నగర్కు చెందిన కట్ట ప్రశాంత్ (35) తన అత్త నక్క నరసవ్వ (55)పై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. 3
భార్య లక్ష్మితో కలిసి ఉండకపోవడం, విడాకుల వ్యవహారానికి అత్తే కారణమని భావించి దాడికి పాల్పడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

