వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్నాథపల్లిలో విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నూతన విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణంతో లైన్ల ఏర్పాటు ముమ్మరంగా జరుగుతోంది. గ్రామైక్య సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన స్థలంలోనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు.
దీంతో భవన నిర్మాణం ఎలా చేపట్టాలని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి స్తంభాలను తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

