వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం గణపతికి 5116 పిండి మోదుగలతో విశేష పూజ నిర్వహించారు. నవరాత్రుల్లో నాలుగో రోజు మహిళలు స్వయంగా తయారు చేసుకుని తీసుకొచ్చిన మోదుగలను గణనాథుడికి నైవేద్యంగా సమర్పించారు.
సుమారు 300 మందికి పైగా మహిళలు పాల్గొని భక్తిశ్రద్ధలతో సమర్పించారు. గణపతికి మోదకం అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యంగా భావిస్తారని, మోదక ప్రియుడుగా పిలుస్తారని తెలిపారు
Comments
Loading comments...

