Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో భూకంపం బీభత్సం.. 18 మంది మృతి

Follow Udayam Digital on Google
నవీన్ రెడ్డి Jul 30, 2026 6:30 AM అల్ ఇండియా అంతర్జాతీయ
జపాన్‌లో భూకంపం బీభత్సం.. 18 మంది మృతి - Udayam Digital
జపాన్‌లో 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 18 మంది మృతిచెందగా, 62 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్యుషు దీవిలో అనేక ఇళ్లు కూలిపోగా, కషీమాలోని షాపింగ్‌ మాల్‌ కూలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో మరో భారీ భూకంపం సంభవించే ప్రమాదముందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...