వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా సారంగాపూర్లో పిచ్చికుక్క స్వైరవిహారం చేయడంతో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిద్రిస్తున్న వారిపై దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కుక్కల నివారణకు గ్రామాల్లో తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

