వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్లో శనివారం వైసీపీ నాయకులు మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ, అనుమతులు జగన్ హయాంలోనే పూర్తయ్యాయని మాజీ గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ పేర్కొన్నారు.
విమానాశ్రయ నిర్మాణ ఘనతను కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడం సరికాదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
