Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయస్థాయి క్రీడా పోటీలకు గిరిజన విద్యార్థిని ఎంపిక

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 1:24 AM పార్వతీపురం మన్యంGeneral
జాతీయస్థాయి క్రీడా పోటీలకు గిరిజన విద్యార్థిని ఎంపిక - Udayam
సీతంపేట ఐటీడీఏ పరిధిలోని భామిని ఏకలవ్య మోడల్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న గిరిజన విద్యార్థిని సుశీల జావెలిన్ త్రోలో సత్తా చాటి జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైంది. ఆగస్టు 11న తిరుపతిలో జరిగిన సౌత్జోన్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి జాతీయస్థాయికి అర్హత పొందింది. ఈ సందర్భంగా బుధవారం ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ సుశీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గంగాదేవి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...