వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటికి దుకాణాల పన్ను విధించడంపై జీవీఎంసీపై లోక్అదాలత్ న్యాయాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిలకవానిపాలెంకు చెందిన అప్పారావుకు సాధారణంగా రూ.వెయ్యిలోపు పన్ను వస్తుండగా, ఈసారి 23,024 చెల్లించాలని నోటీసు ఇచ్చారు
ఇంటిలో రెండు అంతస్తులు దుకాణాలకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే పన్ను ఎలా విధిస్తారని ప్రశ్నించిన న్యాయాధికారి, సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

