వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా ముఠాకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 11 కేసుల్లో నిందితులైన వీరిని పుట్టావారిపాలెం కూడలిలో అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రూ.2 లక్షలకు పైగా విలువైన సొత్తు, 7 కేజీల రాగి తీగ, 150 కేజీల అల్యూమినియం తీగ, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అద్దంకి కోర్టులో హాజరుపరిచారు.
Comments
Loading comments...
