వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కన్నపేట ఎంఆర్సీ పరిధిలోని ప్రీ-ప్రైమరీ తరగతుల కోసం ఎంపీయూపీఎస్ రేగొండలో ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆయా, ఎంపీపీఎస్ ధర్మారంలో ఒక ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఎంఈవో గుగులోత్ రంగానాయక్ తెలిపారు.
స్థానిక అభ్యర్థులు ఈనెల 19 నుంచి 21వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు అక్కన్నపేట ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు ఈసీఈ, డి.ఎడ్ ఉన్నవారు అర్హులు.
Comments
Loading comments...

