వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా చిట్యాలబోరి అంగన్వాడీ కేంద్రంలో వేడి పప్పు పొర్లిపడటంతో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. శ్రీవల్లి, హనీకి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద సమయంలో సిబ్బంది లోపల లేరని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇరుకైన గదిలోనే కేంద్రం నిర్వహించడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు పేర్కొంటూ, నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
