వార్తలకు తిరిగి వెళ్లండి

గట్టు మండలం బల్గెర, తారాపురంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రారంభించారు. అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు.
గద్వాల నియోజకవర్గంలో తొలి విడతలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, సుమారు 2 వేల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇళ్లు రానివారికి రెండో విడతలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

