Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

థాయ్‌లాండ్‌కు భారత సైనిక బృందం

Follow Udayam on Google
జయ Aug 17, 2026 12:46 PM ఆల్ ఇండియా జాతీయ
థాయ్‌లాండ్‌కు భారత సైనిక బృందం - Udayam
భారత్‌-థాయ్‌లాండ్‌ సంయుక్త సైనిక విన్యాసం 'మైత్రీ-XV'లో పాల్గొనేందుకు భారత సైనిక బృందం సోమవారం థాయ్‌లాండ్‌కు బయలుదేరింది. ఆగస్టు 18 నుంచి 31 వరకు సూరత్‌ థానీలోని విభావాడీ రాంగ్‌సిట్‌ క్యాంప్‌లో విన్యాసం జరగనుంది. రెండు దేశాల నుంచి 85 మంది చొప్పున సైనికులు పాల్గొంటారు. అడవులు, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో ఉగ్రవాద వ్యతిరేక, కౌంటర్‌ ఇన్‌సర్జెన్సీ కార్యకలాపాలపై సంయుక్త శిక్షణ ఇస్తారు.

Comments

G
Loading comments...