వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఉత్పాదకత రంగంలో భారత్ పాత్ర వేగంగా పెరుగుతోందని మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ తెలిపారు. ఎంఅండ్ఎం 80వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులనుద్దేశించి ఆయన వర్చువల్గా ప్రసంగించారు.
తయారీ విస్తరణ కోసం దేశాలు భారత్ను నమ్మకమైన పరిష్కారంగా చూస్తున్నాయని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో తమ సంస్థకు మంజూరైన పేటెంట్లు పెరిగాయని, నాగ్పుర్లో రూ.15,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
