Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రకోటలో స్వాతంత్య్ర సంబరాలు

Follow Udayam on Google
కీర్తన్ Aug 15, 2026 8:03 AM ఆల్ ఇండియా జాతీయ
ఎర్రకోటలో స్వాతంత్య్ర సంబరాలు - Udayam
దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించి ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రధాని హోదాలో మోదీ ఈ వేడుకలకు ప్రాతినిధ్యం వహించడం వరుసగా 13వసారి. జాతీయ పతాకావిష్కరణ అనంతరం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Comments

G
Loading comments...