వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగడంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లోకి భారీగా నీరు చేరుతోంది. భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి పెరగగా, పలు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా మెరుగవుతున్నాయి.
శ్రీరామసాగర్, ఎల్లంపల్లి, మేడిగడ్డ తదితర జలాశయాలకు ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాలంటే మరికొన్ని రోజుల పాటు వరద ప్రవాహాలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...
