Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోచారం ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం

Follow Udayam Digital on Google
మానస శర్మ Jul 31, 2026 3:21 PM కామరెడ్డితెలంగాణ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నానికి నీటిమట్టం 15.05 అడుగులకు చేరగా, 4,452 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 0.984 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. లింగంపేట్‌ పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...