వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు పెరిగాయి. ఈ ఏడాది 85,453 మంది విద్యార్థులు చేరగా, గతేడాది 75 వేల మంది మాత్రమే చేరారు.
ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి 1,64,730 మంది విద్యార్థులు ఉన్నారు. మౌలిక వసతులు, విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వ కాలేజీలపై నమ్మకం పెరుగుతోందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
