వార్తలకు తిరిగి వెళ్లండి

సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై ఏడు రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రైతుల డేటాను సేకరించి, వ్యవసాయ శాఖలో సాంకేతికతను, ఏఐ వినియోగాన్ని పెంచాలని సూచించారు.
యూరియా, ఎరువుల పంపిణీకి ప్రత్యేక యాప్ను రూపొందించి, రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించారు. రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తిని పూర్తిగా రాష్ట్రానికే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు.
Comments
Loading comments...

