వార్తలకు తిరిగి వెళ్లండి
ఇమ్రాన్ సోదరికి పాక్ సమన్లు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీకి అక్కడి నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సమన్లు జారీ చేసింది. దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా అసత్య వ్యాఖ్యలు చేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. మే 2025 నాటి ‘ఆపరేషన్ సిందూర్’పై చేసిన వ్యాఖ్యలు, భారత ప్రధాని మోదీతో సైన్యం కుమ్మక్కైందని ఆమె చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి.
అలాగే ఇజ్రాయెల్తో పాకిస్థాన్ సంబంధాలపై కూడా ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, పూర్తి ఆధారాలతో సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
Comments
Loading comments...