వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్బీఐ ఫౌండేషన్, భవిష్య భారత్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా తారాపురంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. శిశువు పుట్టిన గంటలోనే తల్లిపాలు ఇవ్వడం, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు అందించడం మంచిదని వైద్యురాలు ఇందు మైత్రి తెలిపారు.
రెండేళ్ల వరకు ఆహారంతో పాటు తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం బాలింతలకు పోషక విలువలతో కూడిన రాగి పొడిని పంపిణీ చేశారు.
Comments
Loading comments...

