Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 6:31 PM మార్కాపురంGeneral
కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి - Udayam
కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం తక్షణమే క్రమబద్ధీకరించాలని జేఏసీ నాయకుడు శివకృష్ణ కోరారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మార్కాపురం జిల్లాలో వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కటింగ్‌లు లేకుండా వేతనాలు చెల్లించాలని, విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగికి రూ.50 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను అనుమతుల మేరకు బదిలీ చేయాలని వారు కోరారు.

Comments

G
Loading comments...