వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో చేపడుతున్న ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ ప్రక్రియపై ఈనెల 28న సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు గోపాలకృష్ణ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలపై సూచనలు అందించాలన్నారు.
Comments
Loading comments...

