వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో నిన్న రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున కాప్రా, మారేడ్పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని అధికారులు తెలిపారు. తడిరోడ్ల మీద వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

