వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నుంచి వివిధ నగరాలకు విమాన చార్జీలు భారీగా పెరిగాయి. తిరుపతికి సాధారణంగా రూ.3,500 నుంచి రూ.4,200 ఉండే టికెట్ ధర ఈ నెల 17న ఎయిరిండియాలో రూ.18,315 వరకు చేరింది.
ముంబై, ఢిల్లీ, విశాఖ, బెంగళూరు మార్గాల్లోనూ చార్జీలు పెరిగాయి. శ్రావణం, పెళ్లిళ్లు, శుభకార్యాలతో ప్రయాణికుల రద్దీ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని పర్యాటక రంగ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

