Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Jul 30, 2026 6:53 AM రంగారెడ్డి తెలంగాణ
భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు - Udayam Digital
భార్య హత్య కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు షాద్‌నగర్ అదనపు సెషన్స్ కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. 2023లో కడ్తాల్ మండలంలో భార్య స్వరూపను హత్య చేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది. పోలీసులు సేకరించిన సాక్ష్యాలతో నేరం రుజువైనట్లు కోర్టు నిర్ధారించింది. కడ్తాల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా, దర్యాప్తు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

Comments

G
Loading comments...