వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది దేవస్థానంలో హుండీలోని నగదు నాని బూజుపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 62 రోజుల తర్వాత శనివారం హుండీ లెక్కింపులో సుమారు రూ.25 వేల విలువైన నోట్లు పాడైనట్లు గుర్తించారు.
సహస్ర ఘటాభిషేకం సమయంలో హుండీలోకి నీరు చేరినట్లు అధికారులు భావిస్తున్నారు. పాడైన నోట్ల స్థానంలో నగదును దేవస్థానానికి జమ చేశారు.
Comments
Loading comments...

